loader

మణిపుర్ కొత్త ముఖ్యమంత్రిగా ఖేమ్‌చంద్‌ సింగ్‌

మణిపుర్‌ నూతన ముఖ్యమంత్రిగా ఖేమ్​చంద్ సింగ్ ఎంపికయ్యారు. మంగళవారం జరిగిన పార్టీ సమావేశంలో బీజేపీ కేంద్ర పరిశీలకుడు తరుణ్ చుగ్​, పార్టీ ఈశాన్య రాష్ట్రాల ఇన్​ఛార్జ్​ సంబిత్​ పాత్రా తదితరుల సమక్షంలో వై.ఖేమ్​చంద్​ సింగ్​ను బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. దీనితో ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్​లో ఆయన నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. మణిపుర్​లో 2025 ఫిబ్రవరి 13 నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. దీనితో 60 మంది సభ్యుల అసెంబ్లీని అప్పటి నుంచి […]

తమిళనాట ఎన్డీయేలో భారీ కుదుపు – ఎన్నికల బరి నుంచి వైదొలిగిన అన్నామలై, దినకరన్ !

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఎన్డీయే కూటమిలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. గత కొంతకాలంగా రాష్ట్ర బీజేపీని ఉరకలెత్తించిన మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై, ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్ ఇద్దరూ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అన్నాడీఎంకే తో పొత్తు కుదిరినందున సీట్ల సర్దుబాటు , అంతర్గత సమీకరణాల దృష్ట్యా వీరిద్దరూ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.

మహిళా ఉద్యోగిపై వేధింపుల కేసులో ఎమ్మెల్యేపై నాన్-బెయిలబుల్ కేసు

రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన నేత అరవ శ్రీధర్‌పై నమోదైన క్రిమినల్ కేసు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశారని, శారీరకంగా వాడుకుని వదిలేశారని ఓ ప్రభుత్వ మహిళా ఉద్యోగిని చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) జోక్యం చేసుకోవడంతో పోలీసులు వెంటనే కేసు ఫైల్ చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 318(2), 318(4) (మోసం), 351(2) (నేరపూరిత బెదిరింపు) […]

కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు.. అనర్హత పిటిషన్‌పై విచారణకు రావాలని ఆదేశాలు

బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. బుధవారం (ఫిబ్రవరి 4న) ఉదయం 11 గంటలకు అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో స్పీకర్ పేర్కొన్నారు. పార్టీ మారిన కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా స్పీకర్ ఈ నిర్ణయం […]

లడ్డూ కల్తీ వ్యవహారం – సూత్రధారుల్ని తేల్చేందుకు విచారణ కమిషన్​కు కేబినెట్​ నిర్ణయం

తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంపై అసలు సూత్రధారుల్ని తేల్చేందుకు విచారణ కమిషన్​ వేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గంలో సిట్ నివేదికపై చర్చ కొనసాగింది. అన్ని అంశాలు పక్కనపెట్టి మరీ తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై చర్చించారు. విచారణలో ఉన్న వాస్తవాలు ఛార్జ్ షీట్​లో ఎందుకు మిస్ అయ్యాయనే దానిపై ప్రధానంగా చర్చ జరిగింది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ ద్వారా విచారణ బృందం ఏర్పాటు చేసి నిర్ణీత కాలపరిమితిలో […]

అజ్ఞాతం వీడిన అరవ శ్రీధర్.. పవన్ కళ్యాణ్‌ ప్రతిష్టను దిగజార్చవద్దంటూ మహిళ మరో వీడియో

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై అజ్ఞాతం వీడి బయటకొచ్చారు. పార్టీ విచారణ కమిటీ ముందు హాజరయ్యేందుకు కొన్ని గంటల ముందు బాధిత మహిళ మరో వీడియోను విడుదల చేశారు. ఈ సమస్యను రాజకీయం చేయవద్దని, ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిష్టకు భంగం కలిగించవద్దని ఆ వీడియోలో బాధితురాలు కోరారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు గౌరవం ఉందని, ఆయనకు ఈ విషయంలో ప్రమేయం లేదన్నారు. అదే సమయంలో జనసేన ఎమ్మెల్యే శ్రీధర్‌పై మరోసారి ఆరోపణలు […]

అమెరికాతో వాణిజ్య ఒప్పందం.. ప్రధానికి సీఎం చంద్రబాబు అభినందనలు

అమెరికాతో చారిత్రక వాణిజ్య ఒప్పందం చేసుకోవటంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి అభినందించారు. సుంకాలను 18% శాతానికి తగ్గించడం ప్రపంచంలోని రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుందన్నారు. నిరంతరం ప్రపంచ వృద్ధిని కాంక్షించేలా ఈ దార్శనిక నిర్ణయం ఉందని వెల్లడించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ ఆర్థికశక్తి కేంద్రంగా తన పాత్రను సుస్థిరం చేసుకుంటోందన్నారు సీఎం.

అమెరికాతో ట్రేడ్ డీల్- సహనమే గెలిపించింది: ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఢిల్లీలో ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చించి, భారత్‌కు అనుకూలంగా వాణిజ్య సుంకాలను 18%కి తగ్గించినందుకు గాను ఎంపీలు ఆయనను ఘనంగా సన్మానించారు భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని ఈ శతాబ్దపు అతి పెద్ద ఈవెంట్​గా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఆ ఒప్పందం ప్రపంచ వేదికపై భారత్​కు పెరుగుతున్న ప్రభావాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.

జోగి రమేష్‌ ఇంటిపై దాడి కేసులో 11 మంది టీడీపీ కార్యకర్తల అరెస్ట్ – విడుదల

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడి ఘటనలో 40 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయగా, అందులో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు గుర్తించిన 11 మందిని సోమవారం ఉదయం అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితులకు పోలీసులు వెనువెంటనే స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. వీరికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించివేయడంతో వైసీపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. నిందితులపై పెట్టిన సెక్షన్లు బెయిల్‌కు అనుకూలంగా ఉండటంతోనే ఇలా […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON