loader

సీఎం చంద్రబాబును కలిసిన మహిళా ప్రజాప్రతినిధులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. రేపటి మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని, కూటమి ప్రభుత్వానికి చెందిన మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు శివతత్వానికి ప్రతీకగా ఉన్న చీరలను ధరించి సభకు హాజరయ్యారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం వీరంతా ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

త్రిష‌ను వ‌దిలిపెట్టి ఇల్లు చక్కదిద్దుకో..విజయ్‌పై బీజేపీ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తమిళగ వెట్రి కజగం అధినేత విజయ్‌ను లక్ష్యంగా చేసుకుని బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం పెను దుమారం రేపుతున్నాయి. విజయ్ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ, విజయ్ ముందు తన ఇల్లు దాటి బయటకు రావాలని, నటి త్రిషతో ఉన్న అనుబంధం నుంచి బయటపడితేనే ఆయనకు రాజకీయ వాస్తవాలు తెలుస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వచ్చే ముందు తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలని సూచించారు.

రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునే పీఎం రాహత్.. ప్రారంభించిన ప్రధాని

ప్రధాన మంత్రి నూతన కార్యాలయ భవనం సేవా తీర్థ్‌ను ఇవాళ (శుక్రవారం) ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇక నూతన కార్యాలయంలో తొలి రోజున ప్రధాని ఓ కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సాయం అందించేందుకు పీఎం-రాహత్ పేరిట ఈ పథకాన్ని ప్రకటించారు. ప్రమాద క్షతగాత్రులకు రూ.1.50 లక్షల వరకూ వైద్య చికిత్స అందజేయనున్నారు.

జనగామ మున్సిపాలిటీపై ఉత్కంఠ.. వార్డుల వారీగా ఫలితాలు

జనగామ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా, బీఆర్ఎస్ 13 వార్డుల్లో, కాంగ్రెస్ 12 వార్డుల్లో విజయం సాధించింది. నాలుగు వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందగా, ఒక వార్డులో సీపీఎం అభ్యర్థి విజయం సాధించారు. స్వతంత్రుల మద్దతు కీలకం కావడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మంతనాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మూడో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఒక్క ఓటుతో గెలుపొందడం విశేషంగా మారింది.

మ‌హిళ‌ల అకౌంట్ల‌లోకి 5 వేలు బ‌దిలీ.. సీఎం స్టాలిన్ కీల‌క ప్ర‌క‌ట‌న

అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు.. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం మ‌హిళ‌ల‌కు భారీ న‌జ‌రానా అంద‌జేసింది. రాష్ట్రంలోని సుమారు 1.31 కోట్ల మంది మ‌హిళ‌ల‌కు ఇవాళ 5 వేలు బ‌దిలీ చేసిన‌ట్లు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు. క‌లైగ‌నార్ మ‌గ‌లిర్ ఉరిమై తోగై స్కీమ్ కింద న‌గ‌దును ట్రాన్స్‌ఫ‌ర్ చేశారు. ఒక్క రోజే రాష్ట్ర ప్ర‌భుత్వం దాదాపు 6550 కోట్లు పంపిణీ చేసింది. కేఎంయూటీ స్కీమ్ మూడు నెల‌లకు చెందిన మూడు వేల‌తో వ‌న్‌టైం స‌మ్మ‌ర్ రిలీఫ్ రెండు వేలు క‌లిపి […]

మున్సిపల్ ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్ ఘన విజయం.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపు

చిట్యాల మున్సిపాలిటీలో ఓ ట్రాన్స్‌జెండర్  ఒకటో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. తన వార్డును అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చిన సుధాకర్ ఓటర్లను ఆకట్టుకుని ప్రత్యర్థులను ఓడించారు. ఈ వార్డు ఎస్సీ జనరల్ వర్గానికి రిజర్వ్ కాగా.. సుధాకర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రత్యర్థులుగా కాంగ్రెస్, సీపీఎం పొత్తులో భాగంగా సీపీఎం అభ్యర్థిని, బీజేపీ, బీఆర్‌ఎస్, బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేసినా 100 ఓట్ల […]

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పలితాలు .. ఈ నాలుగు చోట్ల హంగ్

3. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఇందులో ఆలంపూర్ ఒకటి.ఈ మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులుంటే అధికార కాంగ్రెస్ 5, ప్రతిపక్ష బిఆర్ఎస్ 5 గెలుచుకున్నాయి. 4. దేవరకద్రలో కూడా హంగ్ పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు వెలువడిన పలితాల ప్రకారం మొత్తం 12 వార్డుల్లో కాంగ్రెస్ 6 గెలుచుకుంది. ఇక బిఆర్ఎస్ 4, బిజెపి 1, ఇతరులు 1 స్థానాన్ని గెలుచుకుంది.

మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ జోరు!

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. ఇప్పటి వరకు 27 మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలుచుకుంది. అటు బీఆర్‌ఎస్ కేవలం 6 స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. అయితే బీజేపీ, ఇతర పార్టీలు ఖాతా కూడా తెరవలేదు. కానీ పలు చోట్ల బీజేపీ అభ్యర్థులు సత్తాచాటారు. మంథని, నాగర్‌కర్నూలు, దేవరకర్ర, ధర్మపురి, కొల్లాపూర్, పెద్దపల్లి వంటి మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.

వడ్డేపల్లి మున్సిపాలిటీ ఫార్వర్డ్‌ బ్లాక్‌ కైవసం – 10 వార్డులకు 8 చోట్ల జయకేతనం

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఫార్వర్డ్‌ బ్లాక్‌ విజయం సాధించింది. మొత్తం పది వార్డుల్లో 8 చోట్ల ఫార్వర్డ్‌ బ్లాక్‌ తరఫున బరిలోకి దిగిన అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్‌ పార్టీ, బీఆర్‌ఎస్‌ పార్టీ ఒక్కో స్థానాన్ని గెలుచుకున్నాయి.  క‌విత తొలిసారి మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేసిన విష‌యం తెలిసిందే. ఏఐఎఫ్‌బీకి చెందిన సింహం గుర్తుపై క‌విత మ‌ద్ధ‌తుదారులు దాదాపు అన్ని స్థానాల నుంచి […]

మంథనిలో, ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ గెలుపు

మంథని మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం 13 వార్డ్ ల్లో కాంగ్రెస్ 11, ఇండిపెండెంట్ ఒకరు, బిఆర్ఎస్ నుంచి ఒకరు గెలుపొందారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. 12 వార్డులలో 10 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగా ఒక వార్డులో బిఆర్ఎస్, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON