loader

పులివెందులలో నందీశ్వర ఆలయంలో హోమం

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన రెండు రోజుల పులివెందుల పర్యటనలో భాగంగా బుధవారం వేంపల్లి మండలం నందిపల్లి గ్రామంలోని నూతనంగా నిర్మించిన నందీశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న శాస్త్రోక్త కార్యక్రమాల్లో భాగంగా జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ నిర్వహించిన హోమంలో ఆయన పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు.

విశాఖ, తిరుపతి, కాకినాడ జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులు – కేబినెట్ నిర్ణయాలివే

విశాఖ, తిరుపతి, కాకినాడ, సత్యసాయి జిల్లా, చీరాల, రాజమహేంద్రవరంలో పర్యాటక ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 55 అజెండా అంశాలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించి సౌర, పవన, హైబ్రిడ్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 160 మెగావాట్లు, 125 మెగావాట్లు ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

వాళ్లు ఎవరికీ భయపడని బబ్బర్ షేర్స్.. రాహుల్ కితాబు

ఢిల్లీలోని భారత్ మండపంలో ఫిబ్రవరి 10న జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో చొక్కాలు విప్పి నిరసనలు తెలిపిన ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఐవైసీ కార్యకర్తలకు సమర్ధనగా ‘యూత్ కాంగ్రెస్ సభ్యులంతా బబ్బర్ షేర్‌లు. మీరు ఎవరికీ భయపడాల్సిన పని లేదు. మీలో దేశభక్తి రక్తం ఉంది. మీరు హరిత విప్లవం తీసుకువచ్చారు. పరిశ్రమలు తీసుకొచ్చారు. ఐటీ విప్లవం తెచ్చారు. వీటన్నింటికీ మోదీ చరమగీతం పాడారు’ అని రాహుల్ అన్నారు.

హెరిటేజ్‌పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెరిటేజ్ సంస్థపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసం సంస్థ పేరును దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. తాను రాజకీయాల్లో ఉన్నందున ఎలాంటి వివాదాలు రాకూడదనే ఉద్దేశంతో దేవాలయాలకు పాలు, నెయ్యి సరఫరా చేయకుండా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇది పూర్తిగా పారదర్శకత కోసం తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. ఇందాపూర్ వ్యవహారంలో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని సీఎం స్పష్టంగా తెలిపారు.

మీ ఆస్తులు ప్రకటిస్తారా… స్టాలిన్‌కు విజయ్ సవాల్

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్‌పై తమిళగగ వెట్రి కళగం (TVK) చీఫ్ విజయ్ విమర్శల దాడి పెంచారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూ పోరాటం చేస్తున్నందుకే తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని విజయ్ ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటామని ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందు ముఖ్యమంత్రికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో, ఇప్పుడెన్ని ఆస్తులున్నాయో వెల్లడించాలని సవాలు చేశారు. వేలూరులో సోమవారంనాడు నిర్వహించిన బహిరంగ సభలో విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అలా అయితే ఫైనల్స్​కు​ వెళ్తా – వస్తానంటే పులివెందుల ఎమ్మెల్యేను తీసుకెళ్తా: మంత్రి లోకేశ్

కిలో నెయ్యి 360 రూపాయలకు ఎక్కడ దొరికినా అది కల్తీదే అన్నారు. మార్కెట్​లో కిలో నెయ్యి 1000 రూపాయలు పైన ఉంటే రూ.360కి ఇచ్చేది కల్తీకాక మరేంటని? ప్రశ్నించారు. టీ20 ప్రపంచ కప్​లో ఇండియా ఫైనల్స్​కు వెళ్తే మ్యాచ్ చూసేందుకు తప్పనిసరిగా వెళ్తా అన్నారు. పులివెందుల ఎమ్మెల్యే వస్తానంటే ఆయనకు టికెట్ కూడా తానే తీసుకుంటాని వెల్లడించారు. బడ్జెట్ మీద చర్చ కావాలని మండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు అడగడం హాస్యాస్పదమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా […]

కాపుల సాయంతో అధికారంలోకి వచ్చి వేధిస్తారా?: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం

‘మాజీమంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి బాధాకరం. ఇళ్లమీద దాడి చేయడం సరికాదు’అని ముద్రగడ పద్మనాభం హితవు పలికారు. ‘మేము (కాపు) బానిసలం కాదు.. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మేము రాలేదు. కాపుల సహకారంతో  రెండు సార్లు అధికారం చేపట్టి, రెండుసార్లు కాపులను అవమానించారు. మొదటి సారి నన్ను, నా కుటుంబాన్ని హింసించి పచ్చి భూతులు తిట్టారు. ఇప్పుడు అంబటి రాంబాబుని హింసించారు’అని ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రధానిపై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు

తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ‘‘మాకు నరేంద్ర మోదీ అంటే భయం లేదు. మోదీ తండ్రి వచ్చినా సరే మేము భయపడబోము” అని వ్యాఖ్యానించారు. టీవీలో మోదీ కనిపిస్తే ప్రజలు భయపడుతున్నారని, అదే సీఎం స్టాలిన్ కనిపిస్తే కొత్త పథకాలు వస్తాయని సంతోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికలు ‘తమిళనాడు వర్సెస్ ఢిల్లీ’ మధ్య జరుగుతున్న పోరాటమని ఉదయనిధి అభివర్ణించారు.

వరద కాలువలో శవమై తేలిన బీజేపీ నేత రమణ

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్ధపల్లిలో గత మూడు రోజులుగా అదృశ్యమైన బీజేపీ నేత రమణ, ఆదివారం స్థానిక వరద ఎస్సారెస్పీ కాలువలో శవమై కనిపించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా రమణ పని చేశారు. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో పోటీచేసి స్వల్ప తేడాతో ఓటమి చెందారు. ప్రమాదవశాత్తు కారు కాలువలో పడిందా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నియోజకవర్గాల పునర్విభజనకు సన్నాహాలు

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక సంకేతాలు వచ్చాయి. నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) అంశంపై కేంద్రం ఇటీవల సానుకూల సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ పునర్విభజన ప్రక్రియకు సంబంధించి బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మార్పులు అమలైతే ఆంధ్రప్రదేశ్‌లో 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి  అసెంబ్లీ స్థానాలు సుమారు 50 వరకు పెరగడంతో పాటు, లోక్‌సభ సీట్లు కూడా మరో 7 వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON