loader

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీపై టీడీపీ కీలక నిర్ణయం,

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పోటీగా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు సిద్ధంగా లేని కారణంగా పోటీ నుంచి టీడీపీ తప్పుకుంది. బీజేపీ తమ మద్ధతు కోరితే ఆలోచిస్తామన్నారు చంద్రబాబు. తెలంగాణ తెలుగుదేశం నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం నాడు సమావేశం అయ్యారు.

అడ్లూరి తో నా అనుబంధం విడదీయరానిది.. మంత్రి పొన్నం ప్రభాకర్‌

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో వివాదంపై పొన్నం ప్రభాకర్‌ స్పందించారు. అడ్లూరి తనకు సోదరుడిలాంటి వారని తెలిపారు. కాంగ్రెస్‌లో మాకు 30 ఏళ్ల స్నేహబంధం ఉందని అన్నారు. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం విడదీయరానిది అని అన్నారు. అడ్లూరి లక్ష్మణ్‌పై ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.  కొందరు తన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేశారని అన్నారు. అడ్లూరి బాధపడ్డారని తెలిసి తీవ్రంగా విచారిస్తున్నానని అన్నారు. అడ్లూరి మనసు నొచ్చుకుని ఉంటే చింతిస్తున్నానని చెప్పారు.

ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్ పై తొలిసారి ఆందోళనలో పాల్గొనున్న జగన్!

ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్‌లో తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వైసీపీ ఇప్పుడు ఆందోళన బాట పడుతోంది. ప్రజలకు మేలు చేసే కాలేజీలను ప్రైవేటుపరం చేస్తోందని ఆరోపిస్తున్న జగన్ పార్టీ ఈ నెల పది నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. అక్టోబరు 9న నర్సీపట్నం మెడికల్‌ కాలేజీని సందర్శించబోతున్నట్టు జగన్ ప్రకటించారు. మెడికల్‌ కాలేజీల పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రతి పంచాయతీ నుంచి 500 మందితో సంతకాల సేకరించాలని టార్గెట్ […]

వైసీపీ డిజిటల్ బుక్‌ సీన్ రివర్స్… సొంత పార్టీ నేతలపైనే ఫిర్యాదులు…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన డిజిటల్ బుక్‌లో కొన్ని చోట్ల సొంత పార్టీ నేతలపై ఫిర్యాదులు నమోదు అవుతుండటంతో వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. ఇటీవల వైసీపీ ఆవిష్కరించిన డిజిటల్ బుక్‌లో విడదల రజినీపై ఫిర్యాదు అందింది. తాజాగా మడకశిర వైసీపీ మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామిపై వైసీపీ డిజిటల్ బుక్‌లోకి ఫిర్యాదు చేరింది మున్సిపల్ చైర్మన్‌ను చేస్తానంటూ రూ. 25 లక్షలు తీసుకున్నట్లు కౌన్సిలర్ ప్రియాంక, ఆమె తండ్రి విక్రమ్ డిజిటల్ బుక్‌లో ఫిర్యాదు చేశారు.

ఆఫ్రికాలో టిడిపి నేతలకు నకిలీ మద్యం తయారీలో శిక్షణ : పేర్నినాని

మందుబాబులకు కూడా ఎపి సిఎం చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని వైసిపి మాజీ మంత్రి పేర్నినాని తెలిపారు. ఆఫ్రికా ఫార్ములా తెచ్చి ఎపిలో నకిలీ మద్యం తయారు చేస్తున్నారని అన్నారు. ఆఫ్రికాలో టిడిపి నేతలకు నకిలీ మద్యం తయారీలో శిక్షణ ఇస్తున్నారని, నకిలి మద్యం తాగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అని నాని సూచించారు. డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ ఎన్నికల ముందు బయటకొస్తాడని, ఊగిపోతాడని, ఆడపిల్లలపై అఘాయిత్యాలు  జరుగుతుంటే కలుగులో నుంచి బయటకు రాడని పేర్నినాని […]

దున్నపోతు అంటావా?.. పొన్నం.. క్షమాపణ చెప్పాల్సిందే!

జూబ్లీహిల్స్‌లో జరిగిన మీటింగ్‌లో పొన్నం ప్రభాకర్ మరియు అడ్లూరి లక్ష్మణ్ మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. అడ్లూరి సమయానికి రాలేదని “దున్నపోతు” అంటూ అవమానించిన పొన్నం వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద రాజకీయ వివాదంగా మారాయి. “మాదిగ జాతిలో పుట్టానని నన్ను అవమానిస్తారా?” అంటూ అడ్లూరి ఆవేదన వ్యక్తం చేశారు. రేపటి వరకు క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.

రాజ్యసభ సీటు కోసం ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నారు.. కమల్‌ హాసన్‌పై అన్నామలై ఫైర్‌

ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం చీఫ్‌, రాజ్యసభ సభ్యుడు కమల్‌ హాసన్‌పై బీజేపీ నేత అన్నామలై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరూర్‌ తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడటంపై మండిపడ్డారు. ఒక రాజ్యసభ సీటు కోసం కమల్‌ చాలా కాలంగా తన అంతరాత్మను అమ్ముకున్నారు. కరూర్‌ బాధితుల పరామర్శకు వెళ్లి.. తొక్కిసలాటలో ప్రభుత్వం తప్పు లేదని అంటే ఎవరైనా అంగీకరిస్తారా..? ఆయన మరీ ఇంత దిగజారాలా..? అసలు ఆయన మాటలను తమిళనాడు ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరు’ […]

ఎట్టకేలకు కేజ్రీవాల్‌కు ప్రభుత్వ నివాసం కేటాయింపు

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు అధికారిక బంగ్లా లభించింది సీఎం అధికారిక నివాసాన్ని విడిచిపెట్టిన దాదాపు ఏడాది తర్వాత ఆయనకు కేంద్రం అధికారిక బంగ్లాను కేటాయించింది. 95, లోధి ఎస్టేట్‌లోని టైప్‌ 7 బంగ్లాను కేటాయించింది. అయితే, బీఎస్పీ అధినేత్రి మాయావతి గతంలో నివసించిన లోధి ఎస్టేట్‌ లోని బంగ్లాను కేజ్రీవాల్‌కు కేటాయించాలని ఆప్‌ కోరింది. మంత్రి పంకజ్‌ చౌదరికి కేటాయించడంతో.. కేజ్రీకి వేరే బంగ్లా […]

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. అక్టోబర్ 9న అభ్యర్థులను ప్రకటిస్తాం..!

మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈమధ్యే రాజకీయ పార్టీ స్థాపించిన ఆయన ఓట్ల కదన రంగంలో దూకుతున్నారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రశాంత్ కిశోర్ మీడియాతో మాట్లాడారు. ‘మా పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. అభ్యర్థులను పార్టీ ఎంపిక చేస్తుంది. అక్టోబర్ 9న పేర్లు వెల్లడిస్తాం. లిస్ట్ వచ్చాక మీరు ఆశ్చర్యపోతారు. నా పేరు కూడా ఆ జాబితాలో ఉంటుంది

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు సిద్ధమైన పవన్ కల్యాణ్‌..

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు సిద్ధమయ్యారు. ఈ నెలలోనే అన్ని జిల్లాల్లో పర్యటించాలని భావిస్తున్నారు. ఈ మేరకు పవన్‌ కల్యాణ్‌ షెడ్యూల్‌ను రూపొందిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా నుంచి పవన్‌ కల్యాణ్‌ పర్యటన ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పిఠాపురం, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వరుస పర్యటనలు చేయనున్నట్లు సమాచారం.  ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం ఆ ప్రాంత జన సైనికులు, వీర మహిళలు, నాయకులతో […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON