loader

ఢిల్లీకి వెళ్లాలి మళ్లీ.. మళ్లీ..

రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ ప్రహసనంగా మారింది. నెలకు రెండుమూడు సార్లు ఢిల్లీ వెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెళ్లిన ప్రతిసారి ఆశావహుల జాబితాను పట్టుకొని కాంగ్రెస్‌ కేంద్ర కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. గత సంవత్సరన్నర కాలంగా మంత్రి వర్గ విస్తరణ అదిగో చేస్తాం ఇదిగో చేస్తామంటూ కాలయాపన చేస్తున్న రేవంత్‌ రెడ్డి.. అధిష్ఠానాన్ని మెప్పించటానికి అష్టకష్టాలు పడుతున్నారు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ కోసం ఢిల్లీలో చర్చలు జరగటాన్ని ఈ రాష్ట్ర ప్రజలు వింతగా గమనిస్తున్నారు.

రక్తంతో పవన్ కల్యాణ్ చిత్ర పటం గీసిన డై హార్డ్ ఫ్యాన్

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా త‌ణుకు మండ‌లం దువ్వ గ్రామానికి చెందిన ఇంట‌ర్ విద్యార్థి వెంక‌ట హ‌రిచ‌రణ్ చిన్నప్పటి నుంచే పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. తమ ప్రాంతానికి పవన్ కల్యాణ్ వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అతను ఎలాగైనా తమ అభిమాన హీరోను కలవాలనుకున్నాడు. అంతే.. తన రక్తంతో పవన్ కల్యాణ్ చిత్రం గీశాడు.తను రక్తంతో గీసిన పవన్ కల్యాణ్ ఫొటోను మంత్రి కందుల దుర్గేష్‌కి అంద‌జేశారు. తాను ప‌వ‌న్ కల్యాణ్ వీరాభిమాని అని, ఆయ‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా […]

అసలు విషయం వదిలేస్తున్నారు, నచ్చినట్టు వాడుకుంటున్నారు- మీడియాపై షర్మిల ఆగ్రహం

తను మాట్లాడిన మాటల్లో కావాల్సిన వాటిని మాత్రమే ప్రసారం చేయడమో, పబ్లిష్ చేయడమో చేస్తున్నాయని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. తను మాట్లాడిన ముఖ్యమైన విషయాలు వదిలేసి కేవలం జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన విషయం మాత్రమే పేపర్లలో రాస్తున్నారు అంటూ షర్మిల విమర్శించారు. ఆమె వక్ఫ్ సవరణ బిల్లుపై మాట్లాడిన విషయాలు హైలెట్ కాలేదు. కొన్ని పేపర్లు అయితే అసలు పట్టించుకోలేదు. దీనితో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చర్చ జరగడంతో ఆమె మరోసారి ప్రెస్‌మీట్ […]

ఆ భూములెవరూ కొనొద్దు

గచ్చిబౌలిలో భూములు ఎవరూ కొనొద్దని, ఒకవేళ ఎవరైనా కొన్నా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెనక్కి తీసుకుంటామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలలో అద్భుతమైన ఏకో పార్క్‌ను నిర్మించి సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, హైదరాబాద్ నగర ప్రజలకు బహుమతిగా అందిస్తామని వెల్లడించారు. హైదరాబాదులో తమ పార్టీని ఏకపక్షంగా గెలిపించిన హైదరాబాద్ ప్రజలకు బహుమతిగా ఇవ్వాలని తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

వక్ఫ్ బిల్లుపై రాజ్యసభలో రచ్చ

రాజ్యసభలో సైతం వక్ఫ్ సవరణ బిల్లు ప్రకంపనలు సృష్టిస్తోంది. ముస్లింలకు ఎలాంటి ప్రమాదం జరగబోదని అధికార పక్షం హామీ ఇస్తే.. రాజ్యాంగంపై దాడిగా ప్రతిపక్షం ఆరోపించింది. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అందరి దృష్టిని ఆకర్షించారు. పుష్ప సినిమా డైలాగ్‌తో అధికార పక్షానికి కౌంటర్ ఇచ్చారు. వక్ఫ్ భూమిని ఆక్రమించారంటూ అధికార పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఆ కారణంతోనే వక్ఫ్ బిల్లుకు జనసేన పార్టీ మద్దతు, వీడియో వైరల్

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వక్ఫ్ సవరణ బిల్లుకు జనసేన పార్టీ తరఫున మద్దతు ప్రకటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు.. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ టార్గె్‌ట్‌గా కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీతో పాటూ నేతలు, కార్యకర్తలు.. వక్ఫ్ ఆస్తుల విషయంలో పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటో 2008-2009లోనే చెప్పారంటూ ఓ వీడియోను వైరల్ చేస్తున్నా ఈ వీడియో చూస్తే వక్ఫ్ బిల్లు విషయంలో […]

మూడేళ్ల తర్వాత రాష్ట్రాన్ని పాలించేది మేమే: జగన్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తన మొదటి పాలన లో కొన్ని వ్యూహాత్మక పొరపాట్లు జరిగాయని ఆయన అంగీకరించారు. అయితే, ఈసారి (జగన్ 2.0) మరింత దృఢంగా, కార్యకర్తలకు మద్దతుగా నిలిచే విధంగా తన శైలిని మారుస్తానని చెప్పారు.అధికారం తిరిగి వచ్చాక పార్టీ శ్రేణులకు మరింత దగ్గరగా ఉంటానని, వారిని గౌరవిస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబులో ఎలాంటి మార్పు రాలేదని, తంలోలా ఇప్పటికీ అవినీతి, రాజకీయ […]

జమిలి ఎన్నికలపై తగ్గేదేలే అంటున్న బీజేపీ.. జేపీ నడ్డా కీలక ఆదేశాలు

జమిలి ఎన్నికలపై మరింత ఫోకస్ పెంచింది బీజేపీ. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలని.. మాటిమాటికి వచ్చే ఎన్నికలతో వచ్చే నష్టాన్ని వివరించాలని ఎంపీలకు సూచించారు జేపీ నడ్డా. మరోవైపు ఆఫీస్‌ బేరర్స్‌, జిల్లా అధ్యక్షులతో భేటీ అయిన కిషన్ రెడ్డి.. కాంగ్రెస్‌ హామీల అమలుపై ప్రజా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. దేశమంతటా ఒకేసారి లోక్‌సభ, శాసనసభలకు ఎన్నికలు జరిగితే నిర్వహణ వ్యయం, మానవ వనరుల వినియోగం గణనీయంగా తగ్గడంతో పాటు ప్రభుత్వాల పనికి […]

రేపు లోక్‌సభ ముందుకు వక్ఫ్‌ బిల్లు!

సవరించిన వక్ఫ్‌ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 2న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. 2024 ఆగస్టులో సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిశీలనకు వెళ్లిన వక్ఫ్‌ బిల్లుపై ఇదివరకు లోక్‌సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను తెలిపాయి. సవరించిన వక్ఫ్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టే ముందు ప్రతిపక్ష ఇండియా కూటమి నాయకులతో సీనియర్‌ బీజేపీ మంత్రులు చర్చలు జరిపే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.

ఎమ్మెల్సీ నాగబాబు ఆశలపై నీళ్లు…కేబినెట్ విస్తరణపై సీఎం, డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం

ఏపీలో మంత్రి వర్గ విస్తరణకు సీఎం చంద్రబాబు నాయుడు…డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఇంకా ఏడాది కూడా పూర్తికాలేదు. ఏడాదిలోపే మంత్రి వర్గ విస్తరణ చేయడం…వారిలో కొంతమంది మంత్రులను తొలగిస్తే అసమ్మతి నెలకొనే అవకాశం ఉంటుంది అని సీఎం చంద్రబాబు నాయుడు…డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలను పరిశీలిస్తే మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని తెలుస్తోం

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON