నిర్మల్లో సిఎం.. ఉమ్మడి ఆదిలాబాద్కు వరాల జల్లు
నిర్మల్ ప్రజలు ఇచ్చిన భరోసా, మద్దతు వల్లే సిఎం అయ్యాను అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిర్మల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదని సిఎం పేర్కొన్నారు. పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాద్ జిల్లాకు నిధులు ఇస్తాం. పారిశ్రామికంగానూ అదిలాబాద్ను అభివృద్ధి చేస్తాం. బాసర ఐఐఐటిలోనే యూనివర్సిటీ ఏర్పాటుకు ఏర్పాటు చేయాలని మంత్రి జూపల్లిని కోరుతున్నా అని సిఎం తెలిపారు.

