loader

నారా లోకేశ్‌కు ప్రమోషన్..!?

లోకేశ్‌కు పార్టీలో పగ్గాలు అప్పగిస్తే బెటర్ అనే చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే లోకేశ్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మే 29న టీడీపీ అధినేత.. సీఎం చంద్రబాబు నాయడు మహనాడు వేదికగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ విషయంలో కేసీఆర్ అప్లై చేసిన ప్లాన్‌నే ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా, అప్లై చేసే అవకాశం కనిపిస్తోంది.

ఆపరేషన్ సిందూర్‌పై రాహుల్ ట్వీట్ దుమారం..

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయడానికి ముందు.. కేంద్రం పాకిస్తాన్‌కు సమాచారం ఇచ్చినట్లు ఆరోపిస్తూ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు తెరతీశారు. ఆపరేషన్‌కు ముందు పాకిస్తాన్‌కు సమాచారం ఇచ్చిందని జైశంకర్ బహిరంగంగా చెప్పారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

ప్రధాని మోడీతో మంత్రి లోకేశ్ భేటీ..

ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి శనివారం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ‘యువగళం’కాఫీ టేబుల్ బుక్‌‌ని ఆవిష్కరించి, మొదటి ప్రతిని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని ఆశీస్సులు, మార్గదర్శకత్వం కావాలని, రాష్ట్ర పురోగతికి ప్రధానమంత్రి అందించిన నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.

మనం వారి ఇళ్లలోకి వెళ్లి కొడతాం: పవన్ కల్యాణ్

‘పాకిస్తాన్ మన దేశంలోకి వచ్చి కొడితే.. మనం వారి ఇళ్లలోకి వెళ్లి కొడతాం. మన దేశాభివృద్ధిని చూసి ఓర్వలేకే పాకిస్థాన్ ఉగ్రవాదులతో దాడులు చేయిస్తోంది’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో మనమంతా సైన్యానికి మేమున్నామన్న ధైర్యం ఇవ్వాలి. సైన్యాన్ని కించపరచే సూడో సెక్యులరిస్టుల నోరు మూయించాలి’  సెలబ్రిటీలు వినోదాన్ని మాత్రమే పంచుతారు… దేశాన్ని నడపరు. సెలబ్రిటీస్ నుంచి అంతకు మించి దేశభక్తి ఆశించకండి’అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అవేం కుదరవన్న సీబీఐ కోర్టు…

ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ఏ2గా ఉన్న గాలి జనార్దన్ రెడ్డికి సీబీఐ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష ఖరారు చేయడంతో ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో ఉన్నారు. తనకు జైలులో ప్రత్యేక వసతులు కల్పించాల్సిందిగా గాలి జనార్దన్ రెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే దోషులుగా తేలిన వ్యక్తులు ఎటువంటి ప్రత్యేక కేటగిరీ ఉపశమనం పొందేందుకు అర్హులు కారని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. గాలి జనార్దన్ రెడ్డి పిటిషన్‌ను తోసిపుచ్చింది.

నడ్డా ఆదేశంతో వెనక్కి తగ్గిన కంగన

భారతదేశంలో ఆపిల్ ఉత్పత్తుల విస్తరణ వద్దని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తాను పెట్టిన పోస్ట్ ను బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ తొలగించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా వ్యక్తిగతం గా ఫోన్ చేయడంతో తాను పోస్ట్ ను తొలగించినట్లు కంగనా తెలిపారు. ఆపిల్ సంస్థ భారతదేశంలో విస్తరించడం పట్ల ట్రంప్ ఎందుకు కంగారు పడుతున్నారంటూ రనౌత్ ఆ పోస్ట్ లో వ్యాఖ్యానించారు.

ఒకే రోజు లక్షమందికి పింఛన్లు….ప్రతినెలా సంక్షేమం…టీడీపీ పొలిట్ బ్యూరో

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో కీలకమైన 12 అంశాలపై చర్చించాము. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు 16, 17, 18 తేదీలలో మూడు రోజులు అన్ని నియోజకవర్గాల్లో తిరంగ ర్యాలీలు జరపాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. ‘తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమానికి…ఇబ్బందులుంటే ఆదుకోవడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాం, మే నెలాఖరుకు పార్టీ సంస్థాగత ఎన్నికలన్నింటిని పూర్తి చేస్తాం అని అని టీడీపీ పొలిట్ […]

ప్రధాని నరేంద్రమోడీ ఓ అనికేత్… ఏపీ డిప్యూటీ సీఎం పవన్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రధాని మోడీని అనికేత్‌గా అభివర్ణించారు. ‘‘అనికేత్” ఒక పేరు, ఒక సంకల్పం అని కొనియాడారు. అనికేత్ అంటే ‘ఇల్లు లేకుండా ఉన్నారని..అది దాని అర్థం అని పవన్ చెప్పుకొచ్చారు. ‘‘అనికేత్’ అనేది సృష్టి యొక్క శాశ్వత సన్యాసి అయిన శివుడికి కూడా ఒక పేరు. వారికి విశ్వంలోని ప్రతి కణం ఒక ఇల్లు. నేడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కామాఖ్య నుండి ద్వారక వరకు మొత్తం భారతదేశాన్ని తనదిగా […]

12 ఏళ్ల క్రితం కన్నీళ్లతో, ఆ మాటలు ఎంతో బాధించాయి.. సబితా ఇంద్రారెడ్డి ఎమోషనల్

14 ఏళ్ల పాటు సాగిన ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి భారీ ఊరట లభించింది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా ప్రకటించడంతో.. 12 ఏళ్ల పాటు తాను ఎదుర్కొన్న కష్టాలకు న్యాయం జరిగిందని సబితా ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై తనకు ఉన్న నమ్మకం నిజమైందని సబిత పేర్కొన్నారు.

మిస్టర్ చీప్ మినిస్టర్… తెలంగాణ కాదు..కాంగ్రెస్ దివాలా తీసింది

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రం దివాలా తీయలేదు మిస్టర్ ‘చీప్ మినిస్టర్’ అంటూ ట్వీట్ చేశారు. నిజానికి మేధోపరంగా దివాలా తీసింది, నైతికంగా దిగజారింది మీరూ, మీ అవినీతి కాంగ్రెస్ పార్టీయే అంటూ ఘాటుగా విమర్శించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON