ఢిల్లీకి వెళ్లాలి మళ్లీ.. మళ్లీ..
రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ ప్రహసనంగా మారింది. నెలకు రెండుమూడు సార్లు ఢిల్లీ వెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెళ్లిన ప్రతిసారి ఆశావహుల జాబితాను పట్టుకొని కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. గత సంవత్సరన్నర కాలంగా మంత్రి వర్గ విస్తరణ అదిగో చేస్తాం ఇదిగో చేస్తామంటూ కాలయాపన చేస్తున్న రేవంత్ రెడ్డి.. అధిష్ఠానాన్ని మెప్పించటానికి అష్టకష్టాలు పడుతున్నారు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ కోసం ఢిల్లీలో చర్చలు జరగటాన్ని ఈ రాష్ట్ర ప్రజలు వింతగా గమనిస్తున్నారు.