loader

ఏపీ లోకల్ పోల్స్ కు లైన్ క్లియర్ – కొత్త ఎస్‌ఈసీగా పునేఠా నియామకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర కొత్త ఎన్నికల కమిషనర్ (SEC)గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనిల్‌చంద్ర పునేఠా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో, ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. 2018-19 కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్రంలో త్వరలోనే మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఈ సమయంలో అనిల్‌చంద్ర పునేఠా నియామకం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

మహిళా రిజర్వేషన్ల బిల్లుపై మాకు చిత్తశుద్ధి ఉంది: రేవంత్

మహిళా బిల్లు వీగిపోవడం బిజెపి విధానాల ఓటమిగా భావిస్తోందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళా బిల్లు పేరుతో డీలిమేషన్ బిల్లు తీసుకు వచ్చిందని అన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై తమకు చిత్తశుద్ధి ఉందని తెలియజేశారు. మహిళా బిల్లుపై ప్రధాని నరేంద్రమోడీకి నిజాయితీ లేదని విమర్శించారు. నిజాయితీగా మహిళా రిజర్వేషన్ల బిల్లు తీసుకువస్తే మద్దతు ఇచ్చేవారని అన్నారు. మహిళా బిల్లు పేరుతో డీలిమిటేషన్ బిల్లు తీసుకువచ్చి దక్షిణాదికి అన్యాయం చేసేవారని మండిపడ్డారు. కేంద్రానికి ఆర్థిక వనరులు దక్షిణాది […]

మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు: సీఎం చంద్రబాబు

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత చీకటి రోజని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహిళల హక్కులను ప్రతిపక్ష పార్టీలు ఉద్దేశపూర్వకంగా కాలరాశాయని ఆయన మండిపడ్డారు. మహిళా బిల్లు పరాజయానికి నిరసనగా తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ఎన్డీయే పక్షాలు చేపట్టిన భారీ నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహిళా సాధికారత పట్ల కాంగ్రెస్, ఇతర విపక్షాల కపట నాటకాలు […]

దొంగ బాబా అశోక్ ఖరాత్ కేసులో బిగ్ ట్విస్ట్

తాంత్రిక పూజల పేరుతో పలువురు మహిళలను లైంగికంగా లోబర్చుకున్నారనే ఆరోపణలతో అశోక్ ఖరాత్ అరెస్టైన సంగతి తెలిసిందే. అశోక్ అత్యంత సన్నిహితుడు జితేంద్ర శెల్కే(55) హఠాన్మరణం చెందాడు. అయితే ఈ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శుక్రవారం కుటుంబంతో కలిసి జితేంద్ర శెల్కే తన వాహనంలో థానే ఎక్స్ప్రెస్ వేపై వెళ్తున్నారు. ఆ టైంలో ధోత్రే గ్రామం వద్ద కారు ఓ కంటైనర్ ట్రక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో జితేంద్ర, ఆయన సతీమణి అనురాధా అక్కడికక్కడే మరణించారు. […]

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల డీఏ 2 శాతం పెంపు

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌. క‌రువు భ‌త్యాన్న కేంద్రం పెంచింది. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు డీఏను 2 శాతం పెంచిన‌ట్లు కేంద్రం ప్ర‌క‌టించింది. 2026, జ‌న‌వ‌రి ఒక‌టో తేదీ నుంచి పెంచిన డీఏ అమ‌లులోకి వ‌స్తుంది. ఉద్యోగుల‌కు, పెన్ష‌న‌ర్ల‌కు గ‌డిచిన నెల‌ల‌కు సంబంధించిన ఎరియ‌ర్స్ కూడా అంద‌నున్నాయి. గ‌త డీఏ రేటు.. బేసిక్ జీతంపై 58 శాతంగా ఉండేది. ఇప్పుడు పెంచిన డీఏతో అది 60 శాతం అవుతుంది. ప్ర‌స్తుతం ద్ర‌వ్యోల్బ‌ణ ప‌రిస్థితుల నేప‌థ్యంలో డీఏ పెంచ‌డం.. కొంత […]

నైట్ ప్యాంటుతో ఆఫీసుకా? అసిస్టెంట్‌ను సస్పెండ్ చేసిన కలెక్టర్

బాపట్ల పట్టణంలోని 5వ వార్డు సచివాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ విధుల్లో ఉన్న డిజిటల్ అసిస్టెంట్ డ్రెస్‌కోడ్ పాటించకుండా, నైట్ ప్యాంటు ధరించి ఆఫీసులో ఉండటం చూసి కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయానికి వచ్చేటప్పుడు పాటించాల్సిన కనీస నిబంధనలను విస్మరించడం సహించేది లేదని స్పష్టం చేస్తూ, సదరు ఉద్యోగిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఆ సచివాలయంలో 11 అర్జీలు గడువు ముగిసినా పెండింగ్‌లో ఉండటంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

మధ్యప్రదేశ్‌లో భారీ చోరీ.. దోపిడీ దొంగలను పట్టుకునేందుకు ముమ్మరంగా వేట

మధ్యప్రదేశ్‌లో సింగ్రౌలీ జిల్లా బైదాన్‌ పట్టణంలోని వింద్యానగర్‌ ఏరియా లోగల బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర బ్రాంచ్‌లో దోపిడీ దొంగలు చొరబడి నగదుతోపాటు లాకర్‌లలోని బంగారం, వెండి ఎత్తుకెళ్లారు. రూ.15 కోట్ల విలువైన బంగారం, రూ.35 లక్షల నగదు, వెండితో వారు పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఐదుగరు దుండగులు బ్యాంకులో చొరబడి బ్యాంకు సిబ్బందిని, వినియోగదారులను తుపాకులతో బెదిరించి బంధించారు. అనంతరం కేవలం 20 నిమిషాల్లోనే బంగారం, వెండి, నగదుతో ఉడాయించారు.

మొక్కజొన్న రైతుల ధర్నా ..కాంటా చేసిన ధాన్యాన్ని తరలించాలని డిమాండ్

మొక్కజొన్న రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రంలో నెల్లికొండ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. తూకం వేసిన ధాన్యాన్ని తరలించాలని మూడురోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నానని, తూకం చేసిన ధాన్యానికి రైతు నుంచి వేలిముద్ర వేయించుకోకుండా కాపలాగా ఉంచడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్దె వాహనాల్లో మక్కలు తీసుకొచ్చిన రైతులకు కిరాయి పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల జోక్యంతో ఆందోళన విమరించారు.

రాత్రి 8.30 గంటలకు దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

కేబినెట్ సమావేశంలో విపక్షాల తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయన్నారు. దీనికి విపక్షాలు తప్పకుండా ఫలితం అనుభవిస్తాయని అన్నారు. మహిళలకు విపక్షాలు జవాబు చెప్పాలన్నారు మోదీ. నారీశక్తి వందన్‌ బిల్లుకు ఆమోదం లభించకపోవడం దురదృష్టకరమన్నారు మోదీ.. ఈ నేపథ్యంలో రాత్రి 8.30 గంటలకు దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం చేయనున్నారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన తరువాత మోదీ ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది..

NDA నేతల విందులో సీఎం రేవంత్ : ఢిల్లీ వేదికగా ఆసక్తికర భేటీ!

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్డీఏ కూటమి నేతలు ప్రధానంగా హాజరైన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి ఒంటరిగా వెళ్లడం చర్చనీయాంశమైంది. ఈ విందు కార్యక్రమంలో తెలుగు దేశం కేంద్ర మంత్రులతో పాటు తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలతో, కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON