loader

విశాల్ పెళ్లాడబోతున్న నటి

విశాల్ వివాహం పై క్లారిటీ వచ్చింది. నటి సాయి ధన్సిక ను వివాహం చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేశారు విశాల్. చెన్నైలో నిర్వహించిన ఓ సినిమా ఈవెంట్లో పెళ్లి చేసుకోనున్నట్టు అధికారికంగా ప్రకటించారు విశాల్, సాయి ధన్సిక. అంతే కాదు తమ వివాహం ఆగస్టు 29న జరుగుతుందని తెలిపారు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన కబాలి సినిమాలో ఆయన కూతురిగా నటించింది ఈ బ్యూటీ. అందం అభినయం ఉన్న ధన్సికాకు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు.

జూన్ 12న ‘హరిహర వీరమల్లు’

ఈ సంవత్సరం విడుదల కానున్న భారీ భారతీయ చిత్రాలలో ‘హరి హర వీరమల్లు’ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.  హరి హర వీరమల్లు చిత్రం జూన్ 12న బాక్సాఫీ స్ దగ్గర గర్జించనుంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో భారీ ఎత్తున విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా.. ప్రేక్షకుల హృదయాలను, బాక్సాఫీస్‌ను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉంది.

రాజ్ తో సమంత ఎప్పుడూ సంతోషంగా ఉండాలి.. శతమానం భవతి అని దీవించిన నటి

నాగ చైతన్య తో విడాకుల తర్వాత సమంత ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఇటీవల సమంత శుభం చిత్రంతో నిర్మాతగా కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. అదేవిధంగా వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త అడుగు వేసింది. డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్ ఇప్పుడు బహిరంగ రహస్యం. నాకు అవకాశం ఇచ్చిన సమంతకి శుభం. రాజ్ తో సమంత కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. మీరిద్దరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి.. శతమానం భవతి అని మధుమణి దీవించారు. మధుమణి కామెంట్స్ కి […]

టికెట్ల ధరలను అధ్యయనం చేయడానికి కమిటీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల ధరలను అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది. ఈ కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారు. ప్రస్తుతం థియేటర్లలో టికెట్ల ధరలు ఎలా ఉన్నాయి, న్యాయపరమైన సమస్యలు ఏమిటి అనే విషయాలను కమిటీ పరిశీలిస్తుంది. ప్రజలకు అందుబాటులో ఉండే ధరల్లో టికెట్లు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది.

హరికృష్ణ మనవడి సినిమా.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ట్వీట్ చేయలే?

హరికృష్ణ తనయుడు, దివంగత జానకిరామ్ తనయుడు (ఎన్టీఆర్) హీరోగా కొత్త సినిమా మొదలైంది. హరికృష్ణ మనవడి సినిమా ప్రారంభోత్సవం జరిగితే హరికృష్ణ కుమారులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒక్క ట్వీట్ చేయకపోవడం చర్చనీయాంశం అవుతుంది. సినిమా ప్రారంభోత్సవం రోజున ఎన్టీఆర్ కుమార్తెలు అటెండ్ అయ్యారు. నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ ట్వీట్స్ చేశారు. సినిమా ప్రారంభోత్సవం రోజున హరికృష్ణ కుమారులు కనిపించలేదు. కనీసం ట్వీట్ కూడా చేయలేదని చాలా మంది వేలెత్తి చూపిస్తున్నారు.

హమ్ చేసి, విజిల్ వేసి యూట్యూబ్‌లో పాటలు వెతకొచ్చు

కొన్ని సార్లు పాటలు గుర్తు ఉంటాయి కానీ సినిమా పేరు కానీ, పాటలోని లిరిక్స్ కానీ మర్చిపోతుంటాం. మీకు గుర్తు ఉన్న పాటను హమ్ చేస్తే చాలు ఆ సాంగ్‌ను గుర్తు పట్టి మీకు చెప్పేస్తోంది. మీరు ఎలా హమ్ చేసినా ఆ పాట ఏంటో YouTube గుర్తుపడుతుంది. అవును, YouTube ఒక కొత్త అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా మీరు కేవలం హమ్ చేసుకునే పాట లేదా ఈల ద్వారా పాడిన మీకు నచ్చిన […]

షారుఖ్ ఖాన్ అరుదైన రికార్డ్, మెట్ గాలాలో ఫస్ట్ ఇండియన్ యాక్టర్

హాలీవుడ్ లో అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ అయిన మెట్ గాలాలో పాల్గొన్న తొలి భారతీయ నటుడిగా షారుఖ్ ఖాన్ గుర్తింపు పొందారు. మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో జరిగిన రెడ్ కార్పెట్ పై నడకకు ముందు, న్యూయార్క్ నగరంలోని మాండరిన్ ఓరియంటల్ హోటల్ బయట తన అభిమానులను కలిశారు. అభిమానులతో కరచాలనం చేస్తూ ముద్దులు పెడుతున్న కింగ్ ఖాన్ దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. ఈ పిక్స్ ను మరింతగా వైరల్ చేస్తున్నారు. ఈ ఫోటోస్ […]

సినిమా ఇండ‌స్ట్రీపై ప‌డ్డ ట్రంప్‌.. వారిపై 100 శాతం టారిఫ్

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం తన ట్రూత్ సోషల్ వేదిక ద్వారా “విదేశాల్లో నిర్మించిన” అన్ని సినిమాలపై 100% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. విదేశీ చిత్రాల ప్రవాహాన్ని ఇతర దేశాల కుట్ర గా అభివర్ణించిన ట్రంప్ దీన్ని జాతీయ భద్రతా ముప్పు గా పేర్కొన్నారు. ఈ విదేశీ ప్రోత్సాహకాలు అమెరికా సినిమా పరిశ్రమను వేగంగా క్షీణింపజేస్తున్నాయని, గణనీయమైన ఆర్థిక నష్టాలకు కారణమవుతున్నాయని, దేశీయ చిత్రనిర్మాణాన్ని దెబ్బతీస్తున్నాయని వాదించారు.

పాకిస్తాన్ హీరోకి ప్రకాశ్ రాజ్ మద్దతు, మండిపడుతున్న నెటిజన్లు

పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన అబిర్ గులాల్ సినిమాను ఇండియాలో బ్యాన్ చేయడాన్ని ప్రకాశ్ రాజ్ తప్పు పట్టారు. ఏ సినిమాను ఇలా నిషేదించడం కరెక్ట్ కాదు అన్నారు ప్రకాశ్ రాజ్. పాక్ నటుల సినిమాలు చూస్తారా లేదా అనేది సినిమా రిలీజ్ తర్వాత ప్రజలు నిర్ణయించుకుంటారని, రిలీజ్ చేసి ఫలితాన్ని వారికే వదిలేయాలని ఆయన అన్నారు. ప్రకాశ్ రాజ్ స్పందనపై విమర్శలు వస్తున్నాయి. చాలామంది నెటిజన్లు ప్రకాశ్ రాజ్ ను విమర్శిస్తుండగా.. కొంత […]

కొందరు నటులు రాజకీయాల్లోకి వచ్చి అడ్రస్ లేకుండా పోయారు, నేను హ్యాట్రిక్ కొట్టాను

నందమూరి బాలకృష్ణను పద్మభూషణ్ పురస్కారం వరించిన సందర్భాన్ని పురస్కరించుకుని హిందూపురం ప్రజలు ఆయనకు పౌర సన్మానం చేశారు. 50 ఏళ్లు హీరోగా ప్రపంచంలో ఎవరూ చేయలేదు. అన్నేళ్లు నటించినా, మధ్యలోనే క్యారెక్టర్ ఆర్టిస్టులు అయ్యారు. మీ ఆశీర్వాదంతోనే ఇది సాధ్యం. కొందరు నటులు రాజకీయాల్లోకి వచ్చారు, కానీ అడ్రస్ లేకుండా పోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి ఎన్టీఆర్ నెంబర్ వన్ హీరోగా ఉన్న సమయంలో, పాలిటిక్స్ లోకి వచ్చి ప్రజలకు సేవ చేశారని గుర్తుచేసుకున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON