loader

బాలీవుడ్‌ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025.. ఉత్త‌మ చిత్రంగా ‘లాపతా లేడీస్’

బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే 70వ హ్యుందాయ్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్-2025 వేడుక గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి.దర్శకురాలు కిరణ్ రావు తెరకెక్కించిన ‘లాపతా లేడీస్’ చిత్రం అత్యధిక అవార్డులను కైవసం చేసుకుని సత్తా చాటింది. ఈసారి ఉత్తమ నటుడి అవార్డును ‘చందు ఛాంపియన్’ చిత్రానికి కార్తీక్ ఆర్యన్, ‘ఐ వాంట్ టు టాక్’ చిత్రానికి అభిషేక్ బచ్చన్ సంయుక్తంగా ఈ గౌరవాన్ని అందుకున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన రామ్ చరణ్ దంపతులు

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. శనివారం మోడీతో రామ్ చరణ్ దంపతులు భేటీ అయ్యారు. ఇటీవల ఢిల్లీలో ఆర్చరీ లీగ్ మొదలైంది. ఈ కార్యక్రమాన్ని రామ్ చరణ్ లాంచ్ చేశారు. ఆ లీగ్ సక్సెస్ అయిన సందర్భంగా మోడీని కలిసినట్లు రామ్ చరణ్ సోషల్‌మీడియాలో ఆ ఫోటోలను పంచుకున్నారు. ఆర్చరీ లీగ్‌ ఈ ఏడాది తొలిసారిగా నిర్వహించారు.

భారత తొలి మెంటల్ హెల్త్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పదుకొణె మరోసారి తన సామాజిక బాధ్యతతో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నారు. నిన్న వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆమెను భారత తొలి మెంటల్ హెల్త్ అంబాసిడర్‌గా నియమించింది. దీపికా ఈ బాధ్యత స్వీకరించడం తనకు గౌరవంగా, బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు

ముందు రూ.60 కోట్లు చెల్లించండి.. శిల్పా శెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేరకు మోసం కేసు లో బాలీవుడ్‌ స్టార్‌ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. కొలంబోలో జరిగే ఓ యూట్యూబ్‌ ఈవెంట్‌కు హాజరయ్యేందుకు వెళ్లాలని.. అందుకు అనుమతి ఇవ్వాలని శిల్పా తరఫు న్యాయవాది కోర్టును కోరారు. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది. విదేశీ ప్రయాణ అనుమతి కోరేముందు రూ.60 కోట్లు చెల్లించండి అంటూ వ్యాఖ్యానించింది.

షారుఖ్ ఖాన్ త‌న‌యుడు వెబ్ సిరీస్‌ వివాదం.. నెట్‌ఫ్లిక్స్‌కి నోటిసులు

షారుఖ్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ‘ది బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’ వెబ్ సిరీస్‌పై నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో మాజీ అధికారి సమీర్‌ వాంఖడే ఈ వెబ్ సిరీస్‌లోని ఒక పాత్ర నిజ జీవితంలో త‌న‌ను పోలి ఉంద‌ని.. ఇది చూసిన త‌ర్వాత ప్రేక్ష‌కుల త‌న‌ని త‌న కుటుంబాన్ని సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నార‌ని హైకోర్టును ఆశ్ర‌యించాడు. చిత్ర నిర్మాణ సంస్థ రెడ్‌ చిల్లీస్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌ల‌కు దిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

చెన్నైలో మమ్ముట్టి ఫిల్మ్ కంపెనీపై ఈడీ దాడులు..

ఈడీ అధికారులు చెన్నై గ్రీన్‌వేస్ రోడ్‌లో ఉన్న మమ్ముట్టి కంపెనీ కార్యాలయంపై దాడి నిర్వహించారు. మొత్తం ఎనిమిది మంది ఈడీ అధికారులు, CRPF సిబ్బందితో కలిసి ఈ సోదాలు చేపట్టారు. ఈ దాడులు లగ్జరీ వాహనాల అక్రమ దిగుమతి మరియు విదేశీ కరెన్సీ లావాదేవీల దర్యాప్తులో భాగంగా నిర్వహించినట్లు ఈడీ తెలిపింది. కోచ్చి జోనల్ కార్యాలయం కూడా కేరళ, తమిళనాడులోని 17 ప్రదేశాల్లో ఒకేసారి దాడులు చేసింది.

మలయాళ సూపర్ స్టార్ కు అరుదైన గౌరవం

మలయాళ సినీ ప్రపంచానికి గర్వకారణంగా నిలిచే సూపర్ స్టార్ మోహన్లాల్ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది చేతుల మీదుగా ఆయన “COAS కమండేషన్ కార్డ్” (Chief of Army Staff Commendation Card) స్వీకరించారు. ఈ పురస్కారం సాధారణంగా దేశ రక్షణ, సేవా విభాగం లేదా సైన్యానికి విశిష్టమైన సేవలు అందించిన వారికి మాత్రమే ఇవ్వబడుతుంది.

విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం.. తృటిలో తప్పిన ముప్పు

టాలీవుడ్ హీరో విజయ్‌ దేవరకొండ కారు ప్రమాదానికి గురైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఆదివారంతన స్నేహితులతో పుట్ట పర్తికి వెళ్లాడు విజయ్ దేవరకొండ. సోమవారం (అక్టోబర్ 06) హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా వారి కారును.. బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. అయితే ఈ ప్రమాదం నుంచి విజయ్‌ దేవరకొండ సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదం తర్వాత విజయ్ తన స్నేహితుడి కారులో హైదరాబాద్‌ వెళ్లిపోయాడు.

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మోహన్‌లాల్‌ను సన్మానించిన కేరళ ప్రభుత్వం

భారతీయ సినిమా రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకున్న మలయాళ దిగ్గజ నటుడు మోహన్‌లాల్‌ను కేరళ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ముఖ్య అతిథిగా హాజరై మోహన్‌లాల్‌ను సత్కరించారు. మోహన్‌లాల్‌ను ప్రతి మలయాళీకి గర్వకారణంగా అభివర్ణించారు. మలయాళ సినిమా కళాత్మకంగా, వాణిజ్యపరంగా ఎదగడంలో మోహన్‌లాల్ పాత్ర ఎంతో ఉందని ప్రశంసించారు. లెజెండరీ ఫిల్మ్ మేకర్ అడూర్ గోపాలకృష్ణన్ తర్వాత, రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ కేరళకు ఈ అత్యున్నత గౌరవాన్ని మోహన్‌లాల్ […]

బాలీవుడ్‌ దిగ్గ‌జ నటి సంధ్యా శాంతారామ్ కన్నుమూత

అలనాటి హిందీ, మరాఠీ చిత్రాల ప్రముఖ నటి సంధ్యా శాంతారామ్ కన్నుమూశారు. వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆమె శనివారం ముంబైలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 94. సంధ్యా శాంతారామ్.. భారతీయ చలనచిత్ర దిగ్గజ దర్శకుడు, నిర్మాత అయిన దివంగత వి. శాంతారామ్ సతీమణి. 1950, 60లలో, ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’ ,‘దో ఆంఖే బారా హాత్’, ‘నవరంగ్’, ‘పింజ్రా’ వంటి చిరస్మరణీయమైన చిత్రాల్లో తన నటన, నృత్య కౌశలంతో ప్రేక్షకుల మనసులో […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON