బాలీవుడ్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2025.. ఉత్తమ చిత్రంగా ‘లాపతా లేడీస్’
బాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా భావించే 70వ హ్యుందాయ్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్-2025 వేడుక గుజరాత్లోని అహ్మదాబాద్లో అంగరంగ వైభవంగా జరిగాయి.దర్శకురాలు కిరణ్ రావు తెరకెక్కించిన ‘లాపతా లేడీస్’ చిత్రం అత్యధిక అవార్డులను కైవసం చేసుకుని సత్తా చాటింది. ఈసారి ఉత్తమ నటుడి అవార్డును ‘చందు ఛాంపియన్’ చిత్రానికి కార్తీక్ ఆర్యన్, ‘ఐ వాంట్ టు టాక్’ చిత్రానికి అభిషేక్ బచ్చన్ సంయుక్తంగా ఈ గౌరవాన్ని అందుకున్నారు.