22ఏ సమస్యల ఫాస్ట్రాక్ పరిష్కారానికి హైలెవల్ కమిటీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముగ్గురు అధికారులతో ఈ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ ఛైర్మన్ సీసీఎల్ఎ కమిషనర్ ఉంటారు. ఇందులో సభ్యులుగా లా సెక్రటరీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ ఉంటారు. 118 జీవో బాధితులకు ఉపశమనం కలిగించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.