కాకినాడ జిల్లా తుని సమీపంలో బస్సు బోల్తాపడి 40 మందికి గాయాలయ్యాయి. ఉప్పాడకు చెందిన పెళ్లి బృందం తునిలో పెళ్లికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంటైనర్ లారీ ఢీ కొనడంతో అదుపు తప్పి బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా బస్సు అద్దాలు పగలగొట్టి బయటపడ్డారు.అయితే ప్రమాదంలో 40 మందికి గాయాలయ్యాయి. ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని కాకినాడ జిల్లా ఆస్పత్రికి తరలించారు.