ప్రధాని నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. విశ్వ ఉమియాధామ్లో జరిగిన ఈ వేడుకలో ఏకంగా 7,600 దీపాలను వెలిగించడంతో ప్రాంగణం మొత్తం వెలుగులతో నిండిపోయింది. ఈ సందర్భంగా 150 మంది యువత నేతృత్వంలో 5 వేల మందికి పైగా ప్రజలు ఒకేసారి ‘వందే మాతరం’ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రత్యేకంగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా మా ఉమియా దేవికి మహా హారతి నిర్వహించారు