బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆమె సన్నిహితులు ఏడుగురికి బంగ్లాదేశ్కు చెందిన ఒక కోర్టు మరణశిక్ష విధించింది. 2024లో జరిగిన అల్లర్ల సందర్భంగా ఏడుగురిని నిందితులుగా పరిగణిస్తూ బంగ్లాదేశ్కు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్-2 ఈ మరణశిక్ష ఖరారు చేసింది. మానవత్వానికి వ్యతిరేకంగా నిందితులు వ్యవహరించారని జస్టిస్ మొహమ్మద్ నజ్రుల్ ఇస్లాం చౌదరి తీర్పు వెల్లడించారు. 2024లో బంగ్లాదేశ్లో షేక్ హసీనా ఆధ్వర్యంలోని అవామీ లీగ్ ప్రభుత్వంపై ఆందోళనకారులు తిరగబడ్డ సంగతి తెలిసిందే.