ఈ నెల 16 నుంచి ఉజ్బెకిస్థాన్ వేదికగా ఫిడె చెస్ ఒలింపియాడ్ ప్రారంభం కానుంది. ఇందులో పాల్గొనేందుకు ఆదేశంలోని సమర్కండ్కు చేరుకున్న భారత బృందం దాదాపు 5 గంటలకు పైగా ఎయిర్పోర్టులోనే ఉండిపోయిందని..సమర్కండ్ విమానాశ్రయానికి చేరుకుని 5 గంటలు దాటింది. ఇప్పటికీ గదులు కేటాయించలేదు. ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి బసకు సంబంధించి ఎటువంటి సమాచారం లేదని గ్రాండ్మాస్టర్ శ్రీనాథ్ తెలిపారు. భారత్ తరఫున గుకేశ్, ప్రజ్ఞానంద, కోనేరు హంపి, దివ్య దేశ్ముఖ్, విదిత్, అర్జున్ లు ఈ చెస్ ఒలింపియాడ్లో ఆడనున్నారు.