“నేను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేస్తున్నాను. మధ్యప్రదేశ్ ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. అయితే ఈ అవకాశాన్ని వాడుకోవడంలో నేను పూర్తిగా విఫలమయ్యాను” అని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎక్స్లో ఓ లేఖను పంచుకున్నారు. ఈ లేఖలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలును గురించి దీప్కే ప్రస్తావిచారు. సాగర్ కల్తీ మద్యం విషాదం, బాలాఘాట్ ఇన్ఫెక్షన్ మరణాలు తదితర సమస్యలపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, అతని సహచరులను ఎద్దేవా చేస్తూ మాట్లాడారు.