హైదరాబాద్లో రాత్రిపూట ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చిన ‘థర్డ్ షిఫ్ట్’ బస్సులకు భారీ స్పందన లభిస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి ఆరు ప్రధాన రూట్లలో ప్రత్యేక నైట్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. తొలి ఏడు రోజుల్లోనే 9,286 మంది ప్రయాణికులు ఈ బస్సుల్లో ప్రయాణించారు. కోఠి–పటాన్చెరు, సికింద్రాబాద్–హయత్నగర్, బాచుపల్లి–వేవ్రాక్ , కొండాపూర్ – సికింద్రాబాద్ తదితర కీలక మార్గాల్లో సర్వీసులు నడుస్తున్నాయి.కోఠి నుంచి పటాన్చెరు వెళ్లే రూట్ నంబర్ 222A బస్సు కోసం నాలుగు బస్సులను కేటాయించి ఏకంగా పదహారు ట్రిప్పులు నడిపిస్తున్నారు.