18వ బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీలోని ప్రఖ్యాత ‘భారత్ మండపం’ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా ఒక ప్రత్యేక వీడియోను దేశవిదేశాల ప్రజలతో పంచుకున్నారు. ప్రపంచ దేశాల అగ్రనేతలకు ఘన స్వాగతం పలికేందుకు పూర్తిగా సిద్ధమైన భారత్ మండపం సుందర దృశ్యాలను ఆ వీడియోలో ప్రదర్శించారు. “బ్రిక్స్ 2026కు సర్వం సిద్ధం!” అని పేర్కొంటూ ఆయన సదస్సుపై ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు.