సెప్టెంబరు 11, 2001న ఉదయం న్యూయార్క్ లోని ప్రపంచ ప్రఖ్యాత వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్ ను ఉగ్రవాదులు రెండు విమానాలతో కూల్చిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగి 25 ఏళ్లు అయింది. ఈ నేపథ్యంలో ఆనాటి ఘటనలో మృతిచెందిన వారికి నివాళిగా న్యూయార్క్ హార్బర్ పై 2,977 డ్రోన్లు ఎగిరాయి. ఒక్కో డ్రోన్ ఒక్కో బాధితుడికి నివాళిగా ట్విన్ టవర్స్ రూపంలో ప్రదర్శించారు.