టిబెట్లో గురువారం భూకంపం సంభవించింది. నేపాల్ సరిహద్దులో 5.0 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఈ భూకంపం కారణంగా నేపాల్లోనే మరోసారి ప్రజల్లో ఆందోళన నెలకొంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.46 గంటల సమయంలో, భూమికి 14 కిలో మీటర్ల లోతున ఈ భూకంపం నమోదైనట్లు ఇండియాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. అయితే, ఈ భూకంపం వల్ల ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించలేదని తెలిపింది.