YSRCP లో ఉండాలంటే మతం మారాల్సిందేనని, ఆ పార్టీ నేతలు బలవంతపు మత మార్పిడులకు పాల్పడ్డారని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. అరకు పర్యటనలో భాగంగా నిర్వహించిన సంజీవని కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో హిందూ దేవాలయాల పవిత్రతను దెబ్బ తీశారని, ఆలయాలపై దాడులు చేశారని మండిపడ్డారు. ఓ మాజీ మంత్రి కోడలిని మతం మారాలని ఒత్తిడి చేశారని అన్నారు. ఆమె ఇటీవల బహిరంగంగానే ఈ విషయాన్ని వెల్లడించారని తెలిపారు. ఆమెను ఇంట్లో పూజలు కూడా చేసుకోనివ్వలేదని తెలిపారు.