నరేంద్ర మోదీ శనివారం మరో చారిత్రాత్మక పర్యటనకు శ్రీకారం చుట్టారు. మధ్య ఆసియాలో భారత్కు అత్యంత కీలకమైన ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్ దేశాలలో నాలుగు రోజుల పాటు ఈ ద్వైపాక్షిక, బహుపాక్షిక దౌత్య పర్యటన సాగనుంది. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ తొలి విడతగా ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో ల్యాండ్ అయ్యారు. అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయెవ్ ఆహ్వానం మేరకు సాగుతున్న ఈ పర్యటనలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు.