ఉత్తరప్రదేశ్లోని బరేలీలో రాఖీ పండుగ సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో తీవ్ర తొక్కిసలాట జరిగి చాలా మంది మహిళలు స్పృహతప్పి పడిపోయారు. బరేలీ బీజేపీ మేయర్ ఉమేష్ గౌతమ్ నేతృత్వంలో బరేలీ క్లబ్ గ్రౌండ్లో చీరలు, బహుమతుల పంపిణీ కోసం ఈ వేడుకను ఏర్పాటు చేశారు.చీరలు, బహుమతులు అందుకోవాలనే ఆరాటంలో మహిళలు బారికేడ్లను దాటుకుని వేదిక వైపు దూసుకెళ్లడంతో తోపులాట మొదలైంది. ఉక్కత, రద్దీ, తోపులాట కారణంగా చాలా మంది మహిళలు మైదానంలోనే సొమ్మసిల్లి పడిపోయారు.