సొంతగడ్డపై జరుగుతున్న ప్రతిష్ఠాత్మక టోర్నీ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ స్టార్ షట్లర్ పి. వి. సింధు పతకం లేకుండానే ముగించింది. మహిళల సింగిల్స్ ఆమె పోరాటం ముగిసింది. గురువారం ఉత్కంఠభరితంగా సాగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్లో సింధు 11-21, 21-15, 17-21తో ప్రపంచ నంబర్ 3 వాంగ్ జి యిని (చైనా) చేతిలో ఓటమిపాలైంది. చివర్లో చైనా షట్లర్ గాయంతో ఇబ్బందిపడినా గొప్పగా పోరాడిన తీరు అందర్నీ ఆకట్టుకుంది.