<వేట కోసం సముద్రంలోకి వెళ్లి వారం రోజులు దాటుతున్నా తిరిగి రాకపోవడంతో ఎనిమిది మత్స్యకార కుటుంబాలు తమ ఆత్మీయుల రాక కోసం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అక్కడికి చేరుకున్నారు. అయితే, ఆవేదనలో ఉన్న కుటుంబ సభ్యులు మంత్రిని సూటిగా ప్రశ్నించారు. సముద్రంలో నిజంగానే గాలింపు చర్యలు చేపడుతున్నారా లేదా అన్నది స్వయంగా చూడాలని, ఆ సెర్చింగ్ ఆపరేషన్లో తమ వారిని కూడా వెంట తీసుకెళ్లాలని పట్టుబట్టారు.