రాంచీలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోటీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో TDPL నిర్వహించిన అన్ని పరీక్షలు, ప్రకటించిన ఫలితాలు, నియామక ప్రక్రియలను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. విద్యార్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. 2014 నుంచి ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి సోరెన్ తెలిపారు.