వైకాపా సభ్యుల ఆందోళనతో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. డీఎస్సీపై వాయిదా తీర్మానాలను ఛైర్మన్ తిరస్కరించారు. దీంతో వైకాపా సభ్యులు నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలకు అడ్డు తగిలారు. వారి ఆందోళనల మధ్యే చైర్మన్ ప్రశ్నోత్తరాలు కొసాగించే ప్రయత్నం చేశారు. సభా గౌరవాన్ని కించపరిచేవిధంగా ప్రవర్తించడం సరికాదన్న మంత్రి నాదెండ్ల మనోహర్.. సభను ఆర్డర్ లో పెట్టాలంటూ సూచించారు.