శేషాచలం అటవీ ప్రాంతంలోని ఏనుగులు రెండు గుంపులుగా సంచరిస్తూ రాత్రి సమయాల్లో అటవీ సరిహద్దుల్లోని పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయన్న సమాచారంపై పవన్ కళ్యాణ్ ఆదివారం రోజు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని, ధైర్యం చెప్పాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ఏనుగుల కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని, డ్రోన్ల సహాయంతో వాటి సంచార మార్గాలను గుర్తించాలని సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చోట హనుమాన్ బృందాలను మోహరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.