అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం రేపాయి. కెంటకీ రాష్ట్రం లోని లెక్సింగ్టన్ లోగల ఓ పార్కులో జరిగిన ఈ కాల్పుల్లో ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో 16 ఏళ్ల బాలుడు సహా నలుగురు పెద్దలు ఉన్నారు. మరో 13 ఏళ్ల బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. తొలుత ఓ నివాసంలోకి ప్రవేశించిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్న 39 ఏళ్ల చాడ్ హిక్మన్ మృతదేహం కూడా అదే అటవీ ప్రాంతంలో లభ్యమైంది.