జమ్మూ కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం కిష్త్వార్ జిల్లా దచ్చన్ ప్రాంతంలో రోడ్డుపై వేగంగా దూసుకెళ్లిన ఓ ఎస్యూవీ వాహనం అదుపుతప్పి చీనాబ్ నదిలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. హర్యానా రిజిస్ట్రేషన్ కలిగిన ఎస్యూవీ వాహనం దంగ్దారు నుంచి సౌండర్కు వెళ్తుండగా.. ఉదయం 10.50 గంటల సమయంలో దంగ్దారులోని యెన్వాన్ సమీపంలో అదుపు తప్పి నదిలో పడిపోయింది.