నిజాం కాలేజీలో విద్యార్థులు నిరసనకు దిగారు. విద్యా సంవత్సరం మొదలై ఇన్ని రోజులు గడిచినా తమకు హాస్టల్స్ అలాట్ చేయడంలేదని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ చాంబర్ వద్దకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇదేమీ రాజ్యం ఇదేమీ రాజ్యం.. దొంగల రాజ్యం దోపిడి రాజ్యం.. దొంగల రాజ్యం పోవాలంటే పోరాటాలు చేయాల్సిందే.. ఉద్యమాల గడ్డరా.. నిజాం కాలేజీ అడ్డరా.. అంటూ నినాదాలు చేశారు. తాము వసతి సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నామని, వెంటనే హాస్టల్స్ అలాట్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

