డీఎస్సీపై వైకాపా నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కోరుతూ మెగా డీఎస్సీ-2025 ఉపాధ్యాయులు సంఘీభార ర్యాలీలు చేశారు. ఈసందర్భంగా కర్నూలుకు కడప, అనంతపురంల నుంచి భారీ చేరుకొన్న ఉపాధ్యాయులు వైకాపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరంతా కర్నూలు కొండారెడ్డి బురుజు నుంచి జెడ్పీ కార్యాలయం వరకు ఆత్మగౌరవ ర్యాలీగా వెళ్లారు.