ఈ ఏడాది ఏప్రిల్ లో కేంద్రం రోడ్లపై తిరిగే వాహననాలతో పాటు గాల్లో ఎగిరే విమానాల ఇంధనంలోనూ ఇథనాల్ ను కలిపేందుకు అనుమతి ఇచ్చింది. దీనిపై పత్రికల్లో వచ్చిన ఓ కథనాన్ని ఎక్స్ లో షేర్ చేసిన కేజ్రివాల్.. ఒక వేళ ఇథనాల్ కలిపిన ఇంధనం కారణంగా గాల్లో విమానం ఆగిపోతే పరిస్దితి ఏంటని కేంద్రాన్ని ప్రశ్నించారు. మీ విమానం ఇంజన్ గాలిలోనే ఆగిపోవచ్చు. విమానంలో ప్రయాణించే ప్రమాదాన్ని మీరు కోరుకుంటారా ? అని ఎక్స్ లో ఆయన విమాన ప్రయాణికుల్ని ప్రశ్నించారు.