బాబా అణు పరిశోధన కేంద్రం జెట్టి నిర్మాణం నిమిత్తం సాయిల్ టెస్టు కోసం పశ్చిమబెంగాల్ నుంచి నలుగురు నిపుణులు అనకాపల్లికి వచ్చారు. వీరు అచ్యుతాపురం మండలంలోని పూడిమడక-తంతడి మధ్య సముద్రంలో సాయిల్ టెస్టు నిర్వహిస్తుండగా, పరీక్షా వాహనాన్ని సముద్రంలోకి లాక్కొని వచ్చిన పడవల తాళ్లు తెగిపోవడంతో నలుగురు సముద్రంలో చిక్కుకొన్నారు. సమాచారం అందుకొన్న పూడిమడక మెరైన్, అచ్యుతాపురం పోలీసులు ఆ నలుగురు అధికారులను కాపాడారు.