తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘మా నాన్న ముఖ్యమంత్రి కావడం సమాజంలో వచ్చిన ఓ చారిత్రాత్మకమైన విప్లవం. మా నాన్న సీఎం అయ్యాక నా పై బాధ్యత పెరిగింది. నేను మా కుటుంబం ఆయన వారసత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఇక నేను ఇండస్ట్రీకి వస్తానన్నప్పుడు సొంతంగా నాకంటూ ఓ పేరు, గుర్తింపు తెచ్చుకోవాలని మా నాన్న చెప్పారు. ఎంత కష్టమైనా నా కాళ్లపై నేనే నిలబడాలని ఆయన సలహా ఇచ్చారు’ అంటూ సంజయ్ చెప్పుకొచ్చారు.