నీట్ పేపర్ లీక్ అంశంపై జరిగిన నిరసనలకు మద్దతు తెలుపుతున్న వారిపై ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిరసనలకు మద్దతు ఇచ్చినవారిని ఆయన ‘బొద్దింకలు’గా అభివర్ణించారు. విద్యార్థుల ముసుగులో కొందరు వ్యక్తులు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే అజెండాతో ఈ ఆందోళనలను నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు.ఉద్దేశాలతో కొందరు రోడ్డెక్కి బూతులు మాట్లాడటం, అనుచితంగా ప్రవర్తించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి వారిని ఇళ్లలోని బొద్దింకలను బయటకు విసిరినట్లే సమాజం నుండి తన్ని తగలెయ్యాలని వ్యాఖ్యానించారు.