దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రితిక నాయక్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ నవ్విస్తూ.. భయపెడుతోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉంటాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.