ఏపీలో రైతులకు ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ప్రస్తుతం పాత 26 జిల్లాల ప్రాతిపదికన ఈ బీమా విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఖరీఫ్ సీజన్ వరి పంటకు ఆగస్టు 15 వరకు, ఇతర నోటిఫైడ్ పంటలకు జులై 31 వరకు, వాతావరణ ఆధారిత బీమా కోసం జులై 15 లోపు, రబీ సీజన్ వరి పంటకు డిసెంబర్ 31 వరకు, ఇతర పంటలకు డిసెంబర్ 15 వరకు సమయం ఇచ్చారు.