ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుల అరెస్ట్ రాజకీయంగా దుమారం రేపుతోంది. యూట్యూబ్ ఛానెల్స్కు చెందిన జర్నలిస్టులు కేవీఆర్, రావణ్లను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ నటుడు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దీనికి అంతే ఘాటుగా క బీజేపీ నేత ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి , మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిని వెనకేసుకొస్తున్న ప్రకాష్ రాజ్ను తెలుగు సినీ పరిశ్రమ నుండి శాశ్వతంగా వెలివేయాలంటూ సంచలన డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఈ ఇద్దరి మధ్య నడుస్తున్న సోషల్ మీడియా వార్ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది.