తమిళనాడు మాజీ సీఎం, ప్రతిపక్ష డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ అల్లుడు ఇద్దరు టీవీకే మంత్రులకు పరువునష్టం నోటీసులు పంపారు. ఆ మంత్రులు తనపై నిరాధారమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వంలో 36 శాఖలకు చెందిన డీఎంకే మంత్రులంతా అవినీతి ద్వారా డబ్బు వసూలు చేశారని ఆయన విమర్శించారు. చెరో 16 శాఖలకు చెందిన డబ్బును స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్, ఆయన అల్లుడు శబరీసన్కు పంచారని మంత్రి ఆదవ్ అర్జున మంత్రి ఆదవ్ అర్జున ఆరోపించారు.