తెలంగాణ రాష్ట్రాన్ని పోలియో రహితంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా ఆదివారం (జూన్ 28) నుంచి రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించబోతోంది.ఆదివారం ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పల్స్ పోలియో బూత్లలో ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారు.