ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (E20 Petrol) వినియోగంపై సోషల్ మీడియా వేదికగా సాగుతున్నదుష్ప్రచారాన్నికేంద్ర పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతున్న కొన్ని ఆరోపణలు, పాత ఫోటోలు, వీడియోలు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, అనవసర భయాందోళనలు సృష్టించడానికి చేస్తున్న ప్రయత్నమేనని కేంద్రం స్పష్టం చేసింది. E20 పెట్రోల్ వలన దేశంలో ఎక్కడా కూడా వాహనాల ఇంజిన్ వైఫల్యాలు లేదా బ్రేక్ డౌన్ లు పెద్ద ఎత్తున జరిగినట్లు నివేదికలు రాలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.