పశ్చిమాసియాలో భారతీయ సిబ్బందితో కూడిన రవాణా నౌకలపై దాడులు ఇరాన్ పనేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. భారతీయ నౌకలపై జరిగిన దాడుల్లో సిబ్బంది పలువురు మృతి చెందండం బాధాకరమని, ఆ దాడులను ఖండిస్తున్నట్లు శుక్రవారంనాడు ట్రూత్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. భారత నౌకలపై ఇరాన్ దాడులను తాము అడ్డుకున్నామని తెలిపారు. ఇలాంటి దాడులను అమెరికా ఎంత మాత్రం వెనకేసురాదన్నారు.