అనంతపురం జిల్లా డి.హీరేహాల్ మండలం జాజరకల్ టోల్ప్లాజా సమీపంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఒక సిమెంట్ ట్యాంకర్ను వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు లారీల్లోనూ ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. లారీ క్యాబిన్లో మంటలు వేగంగా వ్యాపించడంతో ఒక వ్యక్తి బయటకు రాలేక అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ప్రమాద తీవ్రతకు రెండు లారీలు కూడా చాలా వరకు మంటల్లో కాలిబూడిదయ్యాయి.