ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ (NDA) కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా రెండేళ్లు పూర్తవుతున్న తరుణంలో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చేపట్టాల్సిన కార్యక్రమాలపై భాగస్వామ్య పక్షాల అగ్రనేతలు ప్రత్యేక దృష్టి సారించారు. గత రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను, అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది. వేడుకల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ రూపకల్పన, భవిష్యత్ వ్యూహాలపై నేతలు క్షుణ్ణంగా సమాలోచనలు జరిపారు.