మంచి వార్తలను మీడియా సంస్థలు దేశ ప్రజలకు మరింత ఎక్కువగా చూపించాల్సిన అవసరం ఉందని.. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు, మంచి పనులు, సక్సెస్ స్టోరీలను మీడియా ఎక్కువగా చూపించకపోతే.. యువత తప్పుదోవ పట్టే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. మంచి విషయాలను మీడియా బలంగా ప్రచారం చేయాలని.. లేకపోతే యువత ఆసక్తి కోల్పోయి బొద్దింకను ఫాలో అవుతుంది అంటూ మలయాళ దినపత్రిక దీపిక 140వ వార్షికోత్సవంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.