పంతొమ్మిదో సీజన్లో ఆరెంజ్ క్యాప్ విజేత ఎవరు? అనే ఉత్కంఠకు తెరపడింది. క్రీజులో ఉన్నంతసేపు ఊచకోతను తలపించే బ్యాటింగ్తో అభిమానులను ఉర్రూతలూగించిన వైభవ్ సూర్యవంశీకి ఈ టోపీ దక్కడం లాంఛనమే. ఎందుకంటే.. ఫైనల్కు ముందు వైభవ్కు గట్టి పోటీనిచ్చిన గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ రేసులో వెనకబడ్డారు.
సీజన్ ఆసాంతం విధ్వంసక బ్యాటింగ్తో ప్రపంచస్థాయి బౌలర్లను భయపెట్టిన ఈ చిన్నోడు 776 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవడమే అందుకు కారణం