కర్ణాటక సరిహద్దుల్లో ఇవాళ సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బాగేపల్లి సమీపంలో వేగంగా వెళ్తున్న ఓ ఆటో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి.

