గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. జూన్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ భారీ వేడుకను నిర్వహించబోతున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేసింది. ఈ గ్రాండ్ ఈవెంట్లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ సహా చిత్ర యూనిట్ మొత్తం సందడి చేయనుంది