దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో వాహనదారులపై భారం పడింది. లీటరు పెట్రోల్పై రూ.3.14, డీజిల్పై రూ.3.11 చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు తీసుకున్న నిర్ణయం నేడు ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చింది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో మొదట రోజువారీ ఉపయోగించే వస్తువులపై ప్రభావం కనిపిస్తుంది.