దిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. దిల్లీ నిర్దేశించిన 76 పరుగుల స్పల్ప లక్ష్యాన్ని.. 6.3 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. కోహ్లి 23*, దేవ్దత్ పడిక్కల్ 34* పరుగులు చేశారు. జాకోబ్ బెథెల్ 20 రన్స్ చేసి జేమీసన్ బౌలింగ్లో ఔటయ్యాడు. దిల్లీకిది వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం.

