ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు (90) కన్నుమూశారు..1935 జూన్ 23న గుంటూరులో జన్మించిన నాదెండ్ల భాస్కరరావు.. తొలిసారి 1978లో విజయవాడ ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన, మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఎన్టీఆర్తో టీడీపీ పార్టీని ఏర్పాటు చేశారు. 1982 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత ఎన్టీఆర్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. 1984 నుంచి ఆగస్ట్ 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు నెలరోజులపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 11వ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.

