రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు మరో మూడు రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం, ఏప్రిల్ 23వ తేదీని ఈ ఏడాదికి చివరి పని దినంగా నిర్ణయించారు. . ఈ సెలవులు జూన్ 11 వరకు కొనసాగుతాయి. తిరిగి జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమై, కొత్త విద్యా సంవత్సరం (2026-27) మొదలవుతుంది

