రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ జాతీయులతో వెళ్తున్న పడవ అండమాన్ వద్ద సముద్రంలో బోల్తా పడింది. ఈ ఘటనలో 250 మంది గల్లంతు అయ్యారు. దక్షిణ బంగ్లాదేశ్లోని టెక్నాఫ్ నుంచి బయలుదేరిన పడవ మలేషియాకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. బలమైన గాలులు, అల్లకల్లోలమైన సముద్రం, సామర్థ్యానికి మించి ప్రయాణించడమే ప్రమాదానికి కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. అధికారులు రెస్య్కూ ఆపరేషన్ చేపట్టారు.

